తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్పై ఆందోళనకారులు దాడి చేసిన ఘటనలో అప్రమత్తంగా వ్యవహరించిన సిబ్బందికి అవార్డులు ఇవ్వాలని రైల్వేశాఖ యోచిస్తోంది. ఈ ఘటన సందర్భంగా ప్రయాణికులను అప్రమత్తం చేసిన ముగ్గురు టీసీలు, ఏసీ మెకానిక్, గార్డుకు ప్రశంసా పత్రాలు ఇచ్చేందుకు రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆందోళనకారులు రైలుపైకి ఎక్కుతున్న సమయంలో అధికారులకు సమాచారం ఇచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేసేలా చేసిన డ్రైవర్ సూరిబాబును ఇప్పటికే రైల్వే ఉన్నతాధికారుల ప్రశంసించారు. సమయస్ఫూర్తితో ఎందరో ప్రాణాలను కాపాడారని అధికారులు కొనియాడారు.
news from eenadu.net breaking news
click here